శుభంకరీ గోశాల 2016 లో కేవలం మూడు గోవులతో మొదలై ఇవాళ 15 గోవుల వరకు చేరుకుంది. ఇందులో అరుదైన జాతి గోవుల్ను కూడా చేర్చుకోవడం జరిగింది. ఇంతవరకు రావడానికి ఎంతోమంది మహానుభావుల సహాయ సహకారాలు, గో దానాలు ఉన్నాయి.
ప్రస్తుతం మన శుభంకరీ సభ్యులు మురళీ రాజు గారి ఆధ్వర్యంలో గోశాల నిర్వహించడం జరుగుతున్నది. ఈ 15 గోవుల కోసం రెండు ఎకరాల భూమిని రెండు సంవత్సరాలపాటు అద్దెకు తీసుకోవడం జరిగింది. ఇక్కడే మరికొన్ని రోజుల్లో ఎండ వానల నుండి గోవుల్ని రక్షించడానికి షెడ్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ 15 గోవుల్ని చూసుకోవడానికి వాటి ఆహారానికి ప్రత్యేక మనుషులకి నెలకి 25 వేల పైనే ఖర్చు అవుతున్నది. ప్రస్తుతం శుభంకరి పరిషత్ వారు గోశాల నిర్వాహకులు మురళి రాజుగారు కలిసి ఆ ఖర్చును భరిస్తున్నారు. మీరు కూడా ఈ గో సేవలో భాగస్వాములైతే ఎంతో మంచి పుణ్యమని వివరించుచున్నాము.
నెలకి కనీసముగా 300 చెల్లించడం ద్వారా మీరు ఒక గోవుని పోషించగలరు. మీ సహాయ సహకారాలతో ఇక్కడి వరకు వచ్చిన గోశాల మరింత ముందుకు వెళుతుందనడంలో సందేహమే లేదు.
గోపూజ వలన ఎన్నో దోషాలు, గ్రహపీడనలు, పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటిది మనం గోవుల్ని పోషిస్తూ, వాటిని రక్షిస్తూ వాటికి సేవ చేయడం లో భాగస్వాములౌతున్నాం... ఎంతటి మహాభాగ్యం!. 🙏🏻
గోశాల చిరునామా
శుభంకరీ గోశాల ముఖ్య నిర్వాహకులు
S. Murali Krishnam Raju,
గట్టుపల్లి , శంషాబాద్, హైదరాబాద్.
Bank Details :-
SBI Bank
Sagi Murali Krishnam Raju
A/C :- 00000020106725509
IFSC :- SBIN0012217
Nizampet branch , hydrabad
Contact number & PAYTM number :- 9000005053
ఓం శ్రీ శుభంకర్యై నమః 🙏
శుభంకరీ గోశాల
Unknown
Tuesday 23 October 2018